టీడీపీ ఆఫీసుపై వైసీపీ శ్రేణుల దాడి

టీడీపీ ఆఫీసుపై వైసీపీ శ్రేణుల దాడి

కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ అద్దాలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఒక కారుకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపైనా దాడి చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.