రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు 

రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆనాడు  YSRను ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. 

YSR గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వైఎస్ షర్మిల అన్నారు.‘పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు’ అంటూ ఆరోపించారు. 

జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ మాత్రమే అని చెప్పారు. మహానేత ఆశయ సాధన కోసం 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే అని పేర్కొన్నారు.