రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

రాజ్యసభ అభ్యర్థులను  వైసీపీ ప్రకటించింది.  వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేసింది.   ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. 

ఈ  మూడు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.  ఆదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.  నేటి నుంచి ఫిబ్రవరి 15వరకు నామినేషన్లు స్వీకరించనుంది.   ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేష్ పదవీ కాలం త్వరలో  ముగియనుంది. వీరు ముగ్గురు ఏప్రిల్‌ 2వ పదవీవిరమణ చేస్తారు. వీరి స్థానాల భర్తీకే ఎన్నికలు జరుగుతాయి.

మరోవైపు ఇవాళ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.  ఫిబ్రవరి 09వ తేదీన ప్రధాని మోదీతోతో ఆయన భేటీ కానున్నారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు ఇతర అంశాలపై చర్చించనున్నారు.