హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో పార్టీ మేనిఫెస్టో కమిటీ నేతలతో ఆమె సమావేశమయ్యారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ప్రాధాన్యం ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారు. మేనిఫెస్టో తయారీ చివరి దశకు చేరుకుందని కమిటీ చైర్మన్ తూడి దేవందర్ రెడ్డి తెలిపారు. రెండు మూడ్రోజుల్లో ఈసీ కేటాయించే పార్టీ సింబల్ను, మేనిఫెస్టోను షర్మిల విడుదల చేయనున్నారు.