కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుంది : షర్మిల

కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుంది : షర్మిల
  • అందుకే రెండు స్థానాల్లోంచి పోటీ: షర్మిల

హైదరాబాద్, వెలుగు :  సీఎం కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతో రెండో స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని ట్విట్టర్​లో విమర్శించారు. ఇదే పదేండ్ల పరిపాలనకు నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ లీడర్లకు డిపాజిట్లు కూడా రావు అనడానికి ఇదే సంకేతమని విమర్శించారు. రాష్ట్రానికే సీఎంని అన్న అహంకారంతో గజ్వేల్​కు ఎమ్మెల్యే అన్న సంగతి కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు.

తొమ్మిదేండ్ల పాలనపై నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు.జర్నలిస్టులను పాములతో పోల్చుతరా ఉద్యమాన్ని ముందుండి నడిపిన జర్నలిస్టులను కేసీఆర్ పాములతో పోల్చడం బాధాకరమని షర్మిల అన్నారు. అవినీతిపై నిజాలు బయటపెడితే విషం చిమ్మినట్లా అని ఫైర్ అయ్యారు.

జర్నలిస్టులు తమ జీవితాలు త్యాగం చేయకపోతే రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. విషం చిమ్మే పత్రికల జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వమని సీఎం కేసీఆర్ చేసిన అహంకార పూరిత కామెంట్లను ఖండిస్తున్నట్లు తెలిపారు.