హైదరాబాద్, వెలుగు: ‘‘కమీషన్ల కక్కుర్తికి పంప్ హౌజ్లే కాదు.. ఏకంగా బ్యారేజ్లే కుంగుతున్నాయి. ప్రాజెక్ట్ కట్టిన నాలుగేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కదిలిందంటే మీ మెగా లోపమేంటో, మెగా దోపిడేంటో మరోసారి తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాసిరకం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరోటి లేదు” అని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ట్విట్టర్లో ఫైర్ అయ్యారు.
రూ.లక్ష కోట్ల ప్రజా ధనాన్ని కాజేశారనడానికి మేడిగడ్డ కుంగడమే నిదర్శనమని, మీ అవినీతికి దర్పాలే కాళేశ్వరం లోపాలని ఆరోపించారు. తప్పులు కప్పిపుచ్చడానికి కుట్ర కోణం అని డ్రామాలు మొదలు పెట్టినా.. ప్రాజెక్ట్ చుట్టూ పోలీసులను పెట్టి నిజాలు దాచిపెట్టినా, కాళేశ్వరం అంతా బోగస్ ప్రాజెక్ట్ అని ఆధారాలతో సహా తెలంగాణ సమాజానికి అర్థమైందని షర్మిల అన్నారు.