ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి

ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో  మేఘా కంపెనీతో కలిసి రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని షర్మిల తెలిపారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు షర్మిల .టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతుందంటూ పాదయాత్రలో షర్మిల విమర్శలు చేశారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో షర్మిల భేటీ అయ్యే అవకాశం ఉంది.