యువరాజ్ సింగ్‌కు గోవా టూరిజం శాఖ నోటీసులు

యువరాజ్ సింగ్‌కు గోవా టూరిజం శాఖ నోటీసులు

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్‌లోని తన విల్లాను గెస్టులకు అద్దెకు ఇవ్వనున్నట్లు యువరాజ్‌ ఆన్‌లైన్‌లో పెట్టడంపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్, 1982 ప్రకారం పర్యాటక శాఖతో హోమ్‌స్టే  (పెయింగ్‌గెస్ట్) ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 

నవంబర్ 18న నార్త్ గోవాలోని మోర్జిమ్‌లో ఉన్న  ‘కాసా సింగ్‌’ పేరిట ఉన్న యువరాజ్‌ విల్లా అడ్రెస్‌కు టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేశ్ కాలే పేరిట నోటీసు జారీ అయింది.డిసెంబర్ 8 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై  వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  టూరిజం యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉన్నందున జరిమానా (రూ. లక్ష వరకు) ఎందుకు విధించకూడదో చెప్పాలని ప్రశ్నించారు.