ఎల్బీ స్టేడియంలో రణరంగంలా మారిన కుస్తీ పోటీలు

ఎల్బీ స్టేడియంలో  రణరంగంలా మారిన కుస్తీ పోటీలు

ఎల్బీస్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్ లో పాతబస్తీ పహిల్వాన్ల  కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు పైల్వాన్లు. కుస్తీల్లో గెలిచింది మేమంటే మేమని వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో  ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ గొడవలో 10 మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న  సైబరాబాద్  పోలీసులు స్టేడియంలోకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఫర్నీచర్స్, ఛైర్లు ధ్వంసం అయ్యాయి.  ఘటనపై ఇరు వర్గాలు పీఎస్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొడవ పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.