డెలివరీ పార్టనర్స్​ కోసం జొమాటో రెస్ట్​ పాయింట్స్

డెలివరీ పార్టనర్స్​ కోసం జొమాటో రెస్ట్​ పాయింట్స్

డెలివరీ పార్టనర్స్​ కోసం జొమాటో రెస్ట్​ పాయింట్స్

అన్ని కంపెనీల వారూ ఉపయోగించుకోవచ్చు

న్యూఢిల్లీ : ఎండ, వానలను తట్టుకుంటూ పనిచేసే డెలివరీ రంగంలోని గిగ్​ వర్కర్ల వెల్ఫేర్​ కోసం చొరవ తీసుకుంటున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్​గోయెల్​ వెల్లడించారు. వివిధ కంపెనీలకు డెలివరీ పార్ట్​నర్స్​గా పనిచేసే వారి కోసం రెస్ట్​ పాయింట్స్​ పేరుతో పబ్లిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ చేయనున్నట్లు ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో ప్రకటించింది. గుర్​గావ్​లో ఇప్పటికే ఇలాంటి రెస్ట్​పాయింట్స్​ పనిచేస్తున్నాయని, మరిన్ని రెస్ట్​పాయింట్స్​ ఏర్పాటు చేయాలని ప్లాన్​ చేస్తున్నామని జొమాటో సీఈఓ దీపిందర్​ గోయెల్​ ఒక బ్లాగ్​పోస్టులో వెల్లడించారు.

ఈ రెస్ట్​పాయింట్స్​లో క్లీన్​ డ్రింకింగ్​ వాటర్​, ఫోన్​ఛార్జింగ్​ స్టేషన్లు, వాష్​రూమ్స్​, హైస్పీడ్​ ఇంటర్​నెట్​, 24 గంటలపాటూ హెల్ప్​డెస్క్​, ఫస్ట్​ ఎయిడ్​  సపోర్ట్​ వంటి సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎన్ని రెస్ట్​ పాయింట్స్​ ఏర్పాటు చేస్తారనేది మాత్రం గోయెల్​ చెప్పలేదు. డెలివరీ పార్ట్​నర్లు ఎదుర్కొనే సవాళ్లు తమకు తెలుసని, అందుకే ఈ చొరవ తీసుకుంటున్నామని గోయెల్​ చెప్పారు. డెలివరీ పార్ట్​నర్స్​ వెల్ఫేర్​ కోసం షెల్టర్​ ప్రాజెక్టు చేపట్టామని, దాని కిందే ఈ రెస్ట్​ పాయింట్స్​ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా,  దేశంలోని గిగ్​ ఎకానమీలో 77 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా.