పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన చేపట్టారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమ కంపెనీ.. గొడ్డు, పంది మాంసాలను డెలివరీ చేయాలంటోందని ఆరోపించారు. కంపెనీ తమ డిమాండ్ లను పట్టించుకోవట్లేదని, గొడ్డు మాంసాలను డెలివరీ చేయాలని ఆజ్ఞాపిస్తోందని వారు తెలిపారు. ఇందుకు నిరసనగా వారం రోజుల పాటు ధర్నా చేపట్టబోతున్నామని ఫుడ్ డెలివరీ బాయ్స్ అన్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి రాజీబ్ బెనర్జీ, దీనిపై మాట్లాడుతూ.. ” తమ మతానికి వ్యతిరేకంగా వెళ్ళమని ఏ సంస్థ ఎవరినీ బలవంతం చేయకూడదు. అది తప్పు. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన విషయంపై నాకు సమాచారం అందింది, నేను ఈ విషయాన్ని పరిశీలిస్తాను ”అని చెప్పారు.