బెంగళూరు: ఆన్లైన్ గ్రోసరీల డెలివరీ మార్కెట్లో పోటీ ముదురుతోంది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో.. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ కంపెనీ గ్రోఫర్స్ను కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. ఇందుకోసం జొమాటో ఆల్ స్టాక్స్ డీల్ ద్వారా 750 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,711 కోట్లు) చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా ఈ–గ్రోసరీస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గ్రోఫర్స్కు ఎక్కువ వాల్యుయేషనే దక్కుతుందని మార్కెట్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. గ్రోఫర్స్ విలీనమయ్యాక ఏర్పడే కొత్త కంపెనీలో జపాన్ టెక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సాఫ్ట్బ్యాంక్ 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,523 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుందని అంటున్నారు. ఆంట్ ఫైనాన్షియల్కు చెందిన జొమాటో ఇది వరకే ఉబర్ ఈట్స్ను విలీనం చేసుకుంది. తన ఫుడ్ డెలివరీ బిజినెస్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి కొన్ని నెలల క్రితం ఉబర్ ఈట్స్ను దక్కించుకుంది. ‘‘ఈ డీల్ విజయవంతమైతే ప్రపంచంలోని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సాఫ్ట్బ్యాంక్, ఆంట్ ఫైనాన్షియల్ ఒక్కటవుతాయి. ఇవి ఇది వరకే పేటీఎంలో ఇన్వెస్ట్ చేశాయి. గ్రోఫర్స్ గతంలోనే సాఫ్ట్బ్యాంక్, టైగర్ గ్లోబల్, సికోనియా నుంచి 220 మిలియన్ డాలర్లు సమీకరించింది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత ఏర్పడటంతో స్విగ్గీ, జొమాటోలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఇండ్లకు సరుకులను డెలివరీ చేయడానికి తమ యాప్స్లో స్పెషల్ ఫీచర్లను మొదలుపెట్టాయి. వస్తువుల సరఫరా కోసం స్థానిక కిరాణా స్టోర్లతోపాటు హెచ్ఎయూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్, గోద్రెజ్, డాబర్, మారికో, విశాల్ మెగామార్ట్, అదానీ విల్మర్ వంటి ఎఫ్ఎంసీజీలతో డీల్స్ కుదుర్చుకున్నాయి. దాదాపు అన్ని మేజర్ సూపర్ మార్కెట్లు/గ్రోసరీ షాపుల నుంచి కూడా ఇవి సరుకులను డెలివరీ చేస్తున్నాయి. సరుకులతోపాటు మందులనూ ఇంటికి డెలివరీ చేస్తామని స్విగ్గీ తెలిపింది.
జొమాటో కార్ట్ లో గ్రోఫర్స్?..డీల్ విలువు 750 మిలియన్ డాలర్లు
- బిజినెస్
- April 15, 2020
లేటెస్ట్
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
- హంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్