హైదరాబాద్ జూపార్కులో ఏనుగు దాడి..యానిమల్ కీపర్ మృతి

హైదరాబాద్ జూపార్కులో ఏనుగు దాడి..యానిమల్ కీపర్ మృతి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడి చేయడంతో.. జూలో పని చేస్తున్న యానిమల్ కీపర్ చనిపోయాడు. యానిమల్ కీపర్ షాబాజ్ (23) శనివారం జూలో శ్రీను అనే మగ ఏనుగు ఉన్న ప్రదేశంలో క్లీన్ చేస్తుండగా.. ఆ ఏనుగు ఒక్కసారిగా వెనుక నుంచి దాడి చేసింది. దీంతో షాబాజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సిబ్బంది గమనించి షాబాజ్​ను కంచన్​బాగ్​లోని ప్రైవేట్ హస్పిటల్​కు తరలించారు. 

తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.  అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, షాబాజ్ ది పాతబస్తీలోని కాలాపత్తర్. అతని తండ్రి అజీజ్ జూపార్కులో ఉద్యోగం చేసేవారు. అజీజ్​కు నలుగురు కూతుళ్లు, షాబాజ్ ఒక్కడే కొడుకు. అజీజ్ గుండెపోటుతో మరణించడంతో ఆ ఉద్యోగాన్ని మూడేండ్ల కింద షాబాజ్ కు ఇచ్చారు.