Zubeen Garg death: అస్సామీ సింగర్డెత్కేసులో బిగ్ట్విస్ట్..సంగీత దర్శకుడు శేఖర్జ్యోతి అరెస్ట్

Zubeen Garg death: అస్సామీ సింగర్డెత్కేసులో బిగ్ట్విస్ట్..సంగీత దర్శకుడు శేఖర్జ్యోతి అరెస్ట్

ఫేమస్​ అస్సామీ సింగర్​ జుబీన్​గార్డ్ డెత్ మిస్టరీ కేసు కీలక మలుపుతిరిగింది. ఈకేసులో ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్​ జ్యోతి గోస్వామిని సిట్​అధికారులు అరెస్టు చేశారు. జుబీన్​ గార్గ్​ చనిపోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా శేఖర్​ జ్యోతి ఉన్నాడు. గురువారం (సెప్టెంబర్​25) శేఖర్​ జ్యోతి గోస్వామిని విచారణ కోసం సిట్​అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జుబీన్​ గార్గ్​మిస్టీరియస్ కేసులో శేఖర్​ గోస్వామిపై పాత్రపై ఎటువంటి వివరాలు సిట్​బృందం వెల్లడించలేదు. 

మరోవైపు ప్రముఖ వ్యాపార వేత్త, కల్చరల్ యాక్టివిస్ట్​ శాంఖను మహంత కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. శాంకను మహంత ను కూడా త్వరలో సిట్​ అధికారులు అరెస్ట్​ చేసే ఛాన్స్​ ఉంది. గురువారం ఉదయం మహంతా నివాసంలో సోదాలు చేశారు. అయితే సోదాలో ఏమైన ఆధారాలు దొరికాయా అనే దానిపై సిట్​ అధికారులు వివరాలు వెల్లడించలేదు. 

►ALSO READ | అలా ఎలా మింగావు బ్రో.. కడుపులో స్పూన్లు, బ్రష్లు, పెన్నులు చూసీ డాక్టర్లు షాక్.. !

ఈ కేసులో మరికొంతమందిని కూడా సిట్ విచారించే అవకాశంఉంది. సింగపూర్​ అస్పాం అసోసియేషన్ సభ్యులను కొంతమందిని విచారించనుంది సిట్ బృందం. విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరికొంతమంది అరెస్ట్​అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఏంటీ కేసు..? 

సెప్టెంబర్ 19న ప్రముఖ అస్సామి సింగర్​ జుబీన్​ గార్గ్​ సింగపూర్​ లో సముద్రం స్విమ్మింగ్​ చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గార్గ్​ మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగళవారం పాపులర్​ సింగర్​ గార్గ్​ అంత్యక్రియలు గౌహతిలో అస్సాం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది.