‘నోట్లు పంచండి.. ఓట్లు కొనండి’ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

‘నోట్లు పంచండి.. ఓట్లు కొనండి’ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అధికార పార్టీ బాహాటంగా తెరలేపింది. ‘నోట్లు పంచండి.. ఓట్లు కొనండి’ అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు స్థానిక నాయకులతో ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ  ఎమ్మెల్యే రాములు నాయక్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లను కొనాలని నాయకులకు సూచించారు. ‘ఎన్నికల్లో విజయం కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఓటర్లకు ఖర్చుల కోసం డబ్బులిద్దాం. ఓటర్లను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులిద్దాం. భయం లేకుండా డబ్బులు పంపిణీ చేద్దాం.