జెరూసలెం: కరోనాతో అల్లల్లాడుతున్న భారత్ కోసం ఇజ్రాయెల్ వాసులు ప్రార్థనలు చేశారు. వైరస్ బారి నుంచి ఇండియా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఓం నమ: శివాయ అంటూ నినాదాలు చేశారు. టెల్ అవీవ్ సిటీలోని హబీమా స్క్వేర్ వద్దకు వందలాదిగా చేరుకున్న ప్రజలు ఓం నమ: శివాయ మంత్రాన్ని జపిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ కోసం ఇజ్రాయెల్ వాసులు ప్రార్థనలు చేయడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.