హనుమకొండ సిటీ, వెలుగు : షైన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్ షిప్ టెస్ట్కు అనూహ్య స్పందన లభించిందని ఆ కాలేజీ చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం హనుమకొండలోని షైన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ టెస్ట్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాలర్షిప్ టెస్ట్ కు 1500 మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
షైన్ కళాశాలల ప్రారంభం నుంచే ఎంతోమంది విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఉత్తమ బోధనతో షైన్ విద్యాసంస్థలు రాష్ట్రంలోనే అగ్రగామిగా పేరుగాచిందని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు మూగుల రమ, ఎ.కవిత, మూగుల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ప్రశాంత్, మార్కెటింగ్ ఇన్ చార్జిలు రాజేందర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
