దేశంలో కొత్తగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు

దేశంలో కొత్తగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు

దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్నా... థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మూడో దశను ఎదర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేస్తూనే.. కరోనా మెడిసిన్, ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే అంచనాలతో ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

దేశవ్యాప్తంగా 1500 PSA ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేయలని నిర్ణయించారు ప్రధాని మోడీ. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభిస్తే నాలుగు లక్షల ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ లభ్యమవుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మోడీ. వాటి నిర్వహణపై ఆస్పత్రుల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును తెలుసుకునేందుకు లేటెస్ట్ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.