బీజేపీతోనే దేశాభివృద్ధి : సిరికొండ బలరాం

 బీజేపీతోనే దేశాభివృద్ధి  :  సిరికొండ బలరాం

ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. సోమవారం ములుగులోని పార్టీ జిల్లా ఆఫీస్​లో మండలాధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో నేస్తం ఫౌండేషన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్క రాజు సమక్షంలో 50 మంది బీజేపీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం నాలుగో అతిపెద్ద జీడీపీ కలిగిన దేశంగా వెలుగొందనుందన్నారు. 

రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో మేదరి సింధూజ, ఎంపెల్లి శశిలత, సమ్మక్క, ఐత శారద, జన్ను స్వరూప, ప్రమీల, మరాఠి లక్ష్మి, గజ్జి సరోజన, కొలేపాక కొమురమ్మ, ఇనుముల రాజు, పారునందుల శ్రీను, మహేందర్, అరవింద్ తదితరులున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్, ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.