రాజ్యసభ సభ్యునిగా అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యునిగా అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణకు ఆగస్టు 27తో  గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, ఇండిపెండెంట్ గా పద్మరాజన్ నామినేషన్ వేశారు. అయితే  ఎమ్మెల్యేలు బలపర్చకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో అభిషేక్ సింఘ్వి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభిషేక్ సింఘ్వీ 2001 నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

కే.కేశవరావు రిజైన్ తో రాజ్యసభ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతోంది. సెప్టెంబర్ 3న ఎన్నిక  జరగాల్సి ఉంది. అయితే ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో  సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.  ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అభ్యర్థిని ప్రకటించలేదు.