కుత్బుల్లాపూర్ జోన్లో ఏసీబీ సోదాలు

 కుత్బుల్లాపూర్ జోన్లో ఏసీబీ సోదాలు
  • ట్యాక్స్​ ఇన్స్​పెక్టర్​ను విచారించిన అధికారులు 

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ జోనల్​ ఆఫీస్​లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ట్యాక్స్​ ఇన్స్​పెక్టర్​ లంచం డిమాండ్​ చేస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రంగారెడ్డి రేంజ్​ ఏసీబీ డీఎస్సీ ఆనంద్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. భగత్​సింగ్​నగర్​కు చెందిన ఓ వ్యక్తి నాలుగేండ్ల కింద ఇల్లు కొనుగోలు చేశాడు. ట్యాక్స్  అసైస్​మెంట్​ కోసం ఇన్స్​పెక్టర్​ వహీద్​ రూ.2.50 లక్షల ట్యాక్స్​ నోటీసులు ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి ట్యాక్స్​ ఎక్కువ ఉందని అనడంతో, ట్యాక్స్​ తగ్గించండతో పాటు యజమాని పేరు మార్పు కోసం రూ. లక్ష డిమాండ్​ చేశాడు.

అంత ఇవ్వలేనని అనడంతో రూ.90 వేలు డిమాండ్  చేశాడు. ముందుగా రూ.10 వేలు తీసుకున్న అనంతరం మిగిలిన రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేసి, దానిని రూ.75 వేలకు తగ్గించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ట్యాక్స్  ఇన్స్​పెక్టర్​ను విచారించారు. ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగింది.