ఉద్యమకారులు గెలిచారు..తెలంగాణ ద్రోహులు ఓడారు

ఉద్యమకారులు గెలిచారు..తెలంగాణ ద్రోహులు ఓడారు
  • మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. హుజరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ వాదులు, ఉద్యమకారులు గెలిచారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులు ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ లో ఓటమి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ది కాదని.. సీఎం కేసీఆర్ కే చెందుతుందని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవిస్తేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై ప్రకటించి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.