ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్​అలీ

ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? :  షబ్బీర్​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా  కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్న అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ–పంచాయతీ ఉద్యోగుల దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.

క్షేత్రస్థాయిలో సేవలందించే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చేయడం సరికాదన్నారు. ఆయా వర్గాల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. టౌన్​ ప్రెసిడెంట్ ​పండ్ల రాజు పాల్గొన్నారు.