ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 30 వేల 578 మందికి పరీక్షలు చేయగా 4,605 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా సోకిన వారిలో పది మంది చనిపోయారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10మంది మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  

మరో వైపు గడచిన 24 గంటల్లో 11,729 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. కొత్త కేసులను పరిశీలిస్తే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కేసులు నమోదు కాగా.. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 17 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి...

 

ఇవి కూడా చదవండి..

నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే

‘మహాన్’... ట్రైలర్ అదిరింది

ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి