AP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

AP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ఉదయం నుండి రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మండల పరిషత్ అధ్యక్షులతోపాటు ఉపాద్యక్షులు, అలాగే జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నుకునే తేదీల షెడ్యూల్ విడుదల చేశారు. 
తొలుత ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై మండలాధ్యక్షులు (ఎంపీపీ), ఉపాద్యక్షులు (వైఎస్ ఎంపీపీ), అలాగే 25వ తేదీన మధ్యాహ్నం  3 గంటలకు సమావేశమై జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ కు తోడుగా ఒక వైస్ చైర్మన్ ను ఎన్నుకునేవారు. అయితే పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు చేసి ఈసారి ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.