విక్టోరియా (ఆస్ట్రేలియా):ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రం దాదాపు రూ. 250 కోట్ల విలువైన సాయాన్ని ఇండియాకు పంపింది. వెయ్యి వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ అందించింది. ఈ సందర్భంగా విక్టోరియా రాష్ట్ర యాక్టింగ్ ప్రీమియర్ జేమ్స్ మెర్లినో మాట్లాడారు. ‘ఇండియాలో పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోంది. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని అర్థమవుతోంది. వైరస్తో ఇబ్బంది పడుతున్న దేశాలకు సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’
అని జేమ్స్ మెర్లినో చెప్పారు.