జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి: బండి సంజయ్

జనవరి 22న  రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి: బండి సంజయ్

శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట  సందర్భంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు  ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు.  అయోధ్యలో శ్రీరామవిగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారనిచెప్పారు.   విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిధుల సమీకరణలో తెలంగాన రాష్ట్రం రెండవ ప్లేసులో నిలవడం గర్వకారణమన్నారు.

అయోధ్య రాముడు ఒక్క బీజేపీకే దేవుడు కాదు..దేశంలోని అందరికీ శ్రీరాముడు దేవుడేనన్నారు. రాముడిని బీజేపీ పార్టీకి అపవాదించడం వివాదాస్పదం చేయడం సరికాదన్నారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్షింతలు కావాలంటే బాస్మతి బియ్యం అయోధ్యలోని శ్రీరాముని పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తామన్నారు.   కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం  జనవరి 22న అధథికారింంగా సమావేశాలు పెట్టే ప్రయత్నం చేయడం సరైన పద్దతి కాదన్నారు.