సెంచూరియన్: సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. బౌలింగ్లో తస్కిన్ అహ్మద్ (5/35), బ్యాటింగ్లో తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్), లిటన్ దాస్ (48) చెలరేగడంతో.. బుధవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత సౌతాఫ్రికా 37 ఓవర్లలో 154 రన్స్కే ఆలౌటైంది. మలన్ (39) టాప్ స్కోరర్. తర్వాత బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలోనే 156/1 స్కోరు చేసి నెగ్గింది. తస్కిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు లభించాయి.
History for Bangladesh ?
— ICC (@ICC) March 23, 2022
They record their first-ever bilateral ODI series victory in South Africa with an emphatic nine-wicket win in the final match ? #SAvBAN pic.twitter.com/OJoAisR1OI