5 కేజీల బరువుతో పుట్టిండు

5 కేజీల బరువుతో పుట్టిండు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ శిశువు 5 కేజీల బరువుతో పుట్టాడు. పాల్వంచ గ్రామానికి చెందిన శ్రావణికి పురిటి నొప్పులు మొదలవ్వడంతో కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. సోమవారం రాత్రి డాక్టర్లు శ్రీకాంతి, లోకేశ్ సిజేరియన్​ ద్వారా డెలివరీ చేయగా శ్రావణి మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డ 5 కేజీలు ఉన్నాడు. సాధారణంగా పిల్లలు 3 నుంచి 4 కేజీల బరువుతో జన్మిస్తారని, 5 కేజీలు ఉండడం అరుదని డాక్టర్లు తెలిపారు.