
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ బండి సంజయ్కి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై మిర్యాలగూడ పోలీసులు నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది.
2021 నవంబర్ 15న రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా 40 వాహనాలతో కాన్వాయ్గా వెళ్లడం, ఇతర పార్టీ కార్యకర్తలతో గొడవకు దిగడం వంటి ఆరోపణలతో ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ పోలీసులు బండి సంజయ్, బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.