ఇయ్యాల అమీర్​పేటలో .. బ్లడ్ డొనేషన్ క్యాంప్

ఇయ్యాల అమీర్​పేటలో .. బ్లడ్ డొనేషన్ క్యాంప్

పద్మారావునగర్, వెలుగు :  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయి 99వ జయంతి సందర్భంగా సోమవారం సిటీలో  పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సనత్ నగర్ బీజేపీ నాయకులు తెలిపారు.

బీజేపీ నేత మర్రి పురూరవ రెడ్డి ఆధ్వర్యంలో అమీర్ పేట గురు గోవింద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో పేదలకు బ్లాంకెట్ల పంపిణీతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుందని నేతలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.