ఏండ్లుగా పనిచేస్తున్నం..రెగ్యులరైజ్ చేయండి..విద్యుత్  కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన

ఏండ్లుగా పనిచేస్తున్నం..రెగ్యులరైజ్ చేయండి..విద్యుత్  కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన

పంజాగుట్ట, వెలుగు: విద్యుత్‌‌ శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్​ చేస్తూ తాత్కాలిక ఉద్యోగులు మంగళవారం ఖైరతాబాద్‌‌లోని మింట్ కాంపౌండ్‌‌లో ఉన్న శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏడు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పర్మినెంట్​ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపు, క్రమబద్ధీకరణలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జీవో నంబర్​ 11 ప్రకారం తమను రెగ్యలరైజ్​ చేయాలని, విద్యార్హతలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు సతీశ్​రెడ్డి, శ్రీధర్‌‌గౌడ్‌‌, సాయిలు, చందర్‌‌సింగ్‌‌, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.