మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్కు ప్రమాదం..

మంత్రి సత్యవతి రాథోడ్  కాన్వాయ్కు ప్రమాదం..

ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి  పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ ..ఓ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం బోల్తా పడింది. 
 
ములుగు జిల్లా  ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. అయితే తన పర్యటన  ముగించుకుని కాన్వాయ్ లో తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో  కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వెహికల్ ఏటూరునాగారం వైపు వస్తున్న బొలెరో గూడ్స్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బొలెరో వాహనం  బోల్తా పడింది.  తాడ్వాయి సమీపంలో ఈ  ప్రమాదం జరిగింది. ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు  ఉపిరిపీల్చుకున్నారు.