హైదరాబాద్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ను విస్తరించండి : సీఎం రేవంత్

హైదరాబాద్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ను విస్తరించండి : సీఎం రేవంత్
  • కంపెనీ ప్రతినిధులను కోరిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని ఆ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబులు కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగుళూరు  అనుకూలమైన ప్లేస్​లని ప్రతినిధులకు సీఎం వివరించారు. బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్ డీఎల్  డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటికే హైదరాబాద్​లో డిఫెన్స్​కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని,  దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని ప్రతినిధులకు సీఎం వివరించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్​ను ఎంచుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ ఇచ్చారు.  సీఎం ప్రతిపాదనలకు  బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం సానుకూలంగా స్పందించింది.