యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ  కొండచరియలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. ప్రమాద టైంలో భక్తులేవరూ లేక పోవటంతో ప్రమాదం తప్పింది. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. తర్వాత బండరాళ్లను అధికారులు తొలగించారు.