
- అన్ని రాష్ట్రాలతో మాట్లాడే ముందుకెళ్తం
- తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్ అప్రైజల్స్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జలశక్తిశాఖ తేల్చి చెప్పింది. తెలంగాణతో పాటు గోదావరి బేసిన్ రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంప్రదింపులతోనే ముందుకు పోతామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్20 రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసినట్టు తెలిసింది. పీబీ లింక్ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను వ్యతిరేకిస్తూ జూన్లో సీఎం రేవంత్రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వొద్దంటూ ఆ లేఖలో ఆయన తేల్చి చెప్పారు.
ఏపీ చేపట్టే ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖ సెప్టెంబర్ 23న రిప్లై ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పీబీ లింక్పీఎఫ్ఆర్ను సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) పరిశీలిస్తున్నదని సీఆర్పాటిల్చెప్పినట్టు తెలిసింది. పీఎఫ్ఆర్ను ఇప్పటికే గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాలకూ పంపినట్టు తెలిపారు. ఆ ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్అప్రైజల్ను నిబంధనల ప్రకారం చేపడతామని పేర్కొన్నారు.