జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలి

జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీతాఫల్ మండి నుంచి  చిలకలగూడ వెళ్లే మార్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘జన ఆశీర్వాద యాత్ర’లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేవలం ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తాడని ఆరోపించారు. 
దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని, పాలన గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కరోనా సమయంలో బీజేపీ మాత్రమే ప్రజలకు అండగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.