ఎంసీహెచ్ ఆర్డీలో గెస్ట్ హౌస్ నిర్మాణ వ్యయంపై కమిటీ

ఎంసీహెచ్ ఆర్డీలో గెస్ట్ హౌస్ నిర్మాణ వ్యయంపై కమిటీ
  • ఏర్పాటు చేయాలని సీఎస్ కు సీఎంవో ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జూబ్లిహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంసీహెచ్ ఆర్డీ (మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) ప్రాంగణంలో నిర్మిస్తున్న వీవీఐపీ గెస్ట్ హౌస్ లో  మరిన్ని సౌకర్యాల అవసరాలపై, అందుకు అయ్యే వ్యయాలపై  నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును సీఎంవో  ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల సమావేశాలు, వారి వసతి కోసం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ) విభాగం ఆధ్వర్యంలో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. 

నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ఇతర సౌకర్యాల అవసరం, వాటి వ్యయాలను పరిశీలించి, సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించాలని సీఎంవో సూచించింది. కొన్ని నెలలుగా నిర్మాణంలో ఉన్న ఈ గెస్ట్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. రాష్ట్రానికి వచ్చే వీవీఐపీల వసతి కోసం  మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కమిటీ ఏర్పాటు, దాని పరిధి, నివేదిక సమర్పణ గడువు వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.