అమ్మాయి పేరుతో వీడియో కాల్.. బ్లాక్ మెయిల్ చేసి రూ.3.41 లక్షలు కొట్టేసిన చీటర్స్

అమ్మాయి పేరుతో వీడియో కాల్.. బ్లాక్ మెయిల్ చేసి  రూ.3.41 లక్షలు కొట్టేసిన చీటర్స్

బషీర్​బాగ్​, వెలుగు: అమ్మాయి పేరుతో వీడియో కాల్​ చేసిన సైబర్​ చీటర్లు, ఆ తరువాత బ్లాక్​మెయిల్​కు పాల్పడి డబ్బులు గుంజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. గౌలిగూడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 5న జ్యోతి గుప్తా పేరుతో వీడియో కాల్ వచ్చింది. అందులో ఓ మహిళ చనువుగా మాట్లాడింది. 

అనంతరం సైబర్​ చీటర్లు లైన్​లోకి వచ్చి ఆ వీడియో రికార్డు చేశామని, సోషల్​ మీడియాలో పెడుతామని బెదిరించారు. వీడియో కాల్​లో ఉన్న మహిళ చనిపోయిందని, కేసు పెడుతామని బెదిరించారు. ఇలా రకరకాలుగా వేధించి పలుమార్లు డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. ఇలా బాధితుడు పలు దఫాలుగా రూ.3,41,950 పోగొట్టుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించి సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.