విద్యాశాఖ కమిషనర్తో చర్చలు..వారం రోజుల్లో డీఏవీ స్కూల్ రీఓపెన్!

విద్యాశాఖ కమిషనర్తో చర్చలు..వారం రోజుల్లో డీఏవీ స్కూల్ రీఓపెన్!

విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు కమిషనర్ అంగీకరించారు. స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లో స్కూల్ రీ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. 

వారం రోజుల్లో  స్కూల్ రీ ఓపెన్ : పేరెంట్స్

ఎడ్యుకేషన్ కమిషనర్కు అన్ని విషయాలు తెలియజేశామని పేరెంట్స్ తెలిపారు. వారం రోజుల్లో  స్కూల్ రీ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారన్నారు. తమ సమస్యపై కమిషనర్ సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు.

లోపాలను సరిదిద్దుకుంటాం : మేనేజ్మెంట్

లోపాలను సరిదిద్దుకుంటామని కమిషనర్తో చెప్పామని స్కూల్ మేనేజర్ శేషాద్రి తెలిపారు. పేరెంట్స్ స్టేట్మెంట్తో పాటు తమ వినతిని కూడా అందించినట్లు తెలిపారు. గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని.. కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కమిషనర్ లేవనెత్తిన అన్ని అంశాలకు వివరణ ఇచ్చామని తెలిపారు.