ఇలా బరితెగించేశారు ఏంట్రా : మెట్రో రైల్లో ముద్దూ మురిపాలు

ఇలా బరితెగించేశారు ఏంట్రా : మెట్రో రైల్లో ముద్దూ మురిపాలు

సిత్ర సిత్రాల్లో ఢిల్లీ మెట్రో సిత్రాలు వేరయ్యా. ఎందుకంటే అక్కడి ప్రయాణికులు చేస్తున్న చేష్టలు, ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ ను ఎలా వాడుకోవాలో అక్కడి ప్రయాణికులకు తెలిసినట్లు ఎవరికి తెలియదు. ట్రైన్లో ఇప్పటికే డ్యాన్సులు, హెయిర్ స్ట్రెయిటనర్ చేసుకోవడం, ఘర్షణలు పడటం వంటి అనేక ఘటనలు చూశాం. తాజాగా ఓ ప్రేమ జంటకు ఢిల్లీ మెట్రో ప్రైవేటు ప్లేస్ గా మారింది. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు సిగ్గు విడిచి నలుగురి మధ్యలో చేశారు.  ప్రయాణికుల మధ్యనే  ప్రేమికులు గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఉన్నట్లు మరిచారు..రెచ్చిపోయారు..

ఢిల్లీ మెట్రో రైళ్లో ఓ జంట రెచ్చిపోయింది. గాఢంగా ముద్దుపెట్టుకుంటూ మైమరచిపోయారు. ప్రయాణికులు ఉన్నా కూడా పబ్లిక్ గా పనికానిచ్చేశారు. అందరు చూస్తుండగానే ముద్దులతో  రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయింది. 

ఢిల్లీ మెట్రో రైల్లో 

జూన్ 17న ఢిల్లీ మెట్రో ఎల్లో కారిడార్లో రైలు హుడా సిటీ సెంటర్ వైపు వెళుతోంది. ఈ సమయంలో రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.  ఇంతలో ఓ ప్రేమ జంట ఓ  సీట్లో కూర్చొని రొమాన్స్ స్టార్ట్ చేశారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోలేదు. ప్రయాణికులున్నారన్న సోయి లేకుండా పబ్లిక్ గా ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన  దృశ్యాలను మిగతా ప్రయాణికులు కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెట్రో రైలు అధికారులకు ట్యాగ్ చేశారు.

ఢిల్లీ మెట్రో హెచ్చరిక..

ప్రేమికుల ముద్దు వీడియోపై ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. ఢిల్లీ మెట్రోల్లోఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.  ప్రయాణికులు తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు.