తిరుమల  శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం

తిరుమల  శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం

 శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి TTD భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన కాయిన్లను తిరిగి భక్తులకే శ్రీవారి ధన ప్రసాదంగా ఇస్తోంది. శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో 10 నుంచి 20 లక్షల రూపాయలు వరకు భక్తులు చిల్లర నాణేలు రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో.. TTD దగ్గర కాయిన్స్ నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో TTD సరికొత్త ఐడియాతో ముందకు వచ్చింది. కాయిన్స్ ను నోట్ల రూపంలో మార్చుకునేందుకు శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో 100 రూపాయి నాణేలను ప్రత్యేక కవర్లలో భక్తులకు అందజేస్తోంది.

 భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో.. వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా అమ్ముతున్నారు. కవర్లో కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. వందరూపాయలు చెల్లించి ఆ ధనప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్ ప్రసాదం తీసుకోవచ్చు.

ప్రస్తుతం ఒక్క రూపాయి నాణేలను ధనప్రసాదంగా ఇస్తుండగా…రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేల ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులోకీ తీసుకు రానుంది.