
శ్రీనగర్: ‘‘నేను బతక్కపోవచ్చు. ఒక వేళ గాయాలతో నేను చనిపోతే.. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో’’.. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన డీఎస్పీ హుమయూన్ భట్ తన భార్యతో చెప్పిన చివరి మాటలివి. తూటా గాయాలై.. రక్తమోడుతూ తన భార్యతో వీడియో కాల్ మాట్లాడారాయన. ఫాతిమాను ఏడాది కిందటే ఆయన పెండ్లి చేసుకున్నారు. 29 రోజుల కిందటే వీరికి పండండి పిల్లాడు పుట్టాడు. కానీ కొడుకును కండ్లారా చూసుకోకముందే ఆయన అమరులయ్యారు.
Also Rard: స్కూళ్లకు రూ.2 కోట్లు ఇచ్చిన వీఎస్టీ
తనకైన గాయలను బట్టి ఇక బతకనని భావించిన హుమయూన్ భట్.. తొలుత తన తండ్రి, రిటైర్డ్ ఐజీ గులాం హసన్ భట్కు ఫోన్ చేశారు. తాను ఆపరేషన్లో గాయపడ్డానని, తనకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు. తర్వాత తన భార్యతో మాట్లాడిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు.