
హైదరాబాద్, వెలుగు: సీటీ కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్టీ ఇండస్ట్రీస్ రూ. 2 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని నాలుగు గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తూప్రాన్, బ్రాహ్మణపల్లిలో స్కూళ్లను నిర్మించింది. తరగతి గదులను, టాయిలెట్ బ్లాక్లను రిపేర్ చేసింది.