ఉద్యోగులు నీ ఫాం హౌస్ కూలీలు కాదు...ప్రొ.కోదండరాం

ఉద్యోగులు నీ ఫాం హౌస్ కూలీలు కాదు...ప్రొ.కోదండరాం
  • జీవో 317 రద్దు చేయాలి
  • కేసీఆర్ పై మండి పడ్డ ప్రొ.కోదండరాం

ఉద్యోగులు నీ ఫాం హౌస్ కూలీలు, సెక్యూరిటీ గార్డులు కాదని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేసీఆర్కు లెక్కలేదన్నారు. ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను కోదండరాం తీవ్రంగా ఖండించారు. ఫ్యూడల్ ఆలోచనలున్న కేసీఆర్కు రాజ్యాంగం గురించి ఏం అర్థం అవతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తానంటూ  తిక్క తిక్కగా మాట్లాడుతున్న కేసీఆర్ ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా త్వరలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి..

ముందస్తు ఎన్నికలంటూ అసత్య ప్రచారాలు

మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు