కూకట్పల్లి, వెలుగు: కార్మిక రాజ్య బీమా సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా కూకట్పల్లిలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ స్కూల్లో ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సురేశ్కుమార్ చవాన్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాధిక సహకారంతో షుగర్, రక్తపోటు, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు నిర్వహించారు.
