
భయపడినట్లే జరిగింది.. యమునా నది ఉగ్రరూపంలో దూసుకొచ్చింది. అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. ఆల్ టైం రికార్డు స్థాయిలో నీటి ప్రవాహానికి చేరుకుంది. 207 మీటర్లు దాటి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు రావటం మొదలయ్యాయి. ఇప్పటికే నదికి సమీపంలోని మోనస్ట్రీ మార్కెట్ ఏరియా మొత్తం మునిగిపోయింది. ఊహించని పరిణామంలో వ్యాపారులు అందరూ పరుగులు తీశారు. దుకాణాల్లోని సరుకు అంతా నీటి పాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ ఏరియా మొత్తం నడుం లోతు నీటిలో మునిగిపోయింది.
అదే విధంగా... ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగుతోంది. 1978లో గతంలో నెలకొల్పబడిన 207.49 మీటర్ల రికార్డును అధిగమించి జూలై 12న యమునా నది ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరడంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే వారిని తక్షణమే తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వేలాది మంది తమ ఇళ్లను, నదికి సమీపంలో ఉన్న ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఢిల్లీ పోలీసులు... నగరంలోని హాని కలిగించే ప్రాంతాలలో సమావేశాలను పరిమితం చేశారు.
అంతకుముందుు కేజ్రీవాల్.. వర్షాభావ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. "మేము ప్రాణాలను, ఆస్తులను రక్షించాలి. యమునా నదికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది" అని ఉద్ఘాటించారు.
2013 తర్వాత తొలిసారిగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటిందని, సాయంత్రం 4 గంటల సమయానికి 207.71 మీటర్లకు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ నివేదించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. సహాయం కోసం కేంద్రాన్ని ఆశ్రయించారు. అంతకంతకూ పెరుగుతున్న యమునా నది స్థాయిలను నివారించడానికి జోక్యం చేసుకోవాలని వారిని కోరారు. సాధ్యమైతే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని నియంత్రిత పద్ధతిలో విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు.
ఈ క్రమంలో ప్రభుత్వ హామీలపై వరద బాధితుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "మాలాంటి పేద ప్రజలే కష్టాలు పడుతున్నారు... ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేస్తుంది కానీ ఏమీ అమలు చేయడం లేదు" అని రిలీఫ్ క్యాంపులోని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Yamuna water level reaches its highest-ever mark at 207.55 metres; Kejriwal convenes emergency meeting
— ANI Digital (@ani_digital) July 12, 2023
Read @ANI Story | https://t.co/4LAW8b8pEp#YamunaWaterLevel #Yamuna #rain #ArvindKejriwal pic.twitter.com/7250a7TpC4