
- మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని, ఆ సమయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం ఓ గార్డెన్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలు, పీడ కలలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 370 ఆర్టికల్ రద్దవుతుందని ఎవరూ ఉంచలేదన్నారు.
మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దేశానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు భాస సత్యనారాయణ రావు, మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.