కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం , రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమత్తులు చేయాలన్నారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని ట్వీట్ చేశారు.
డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత కూడా L &T కంపెనీ ముందుకొచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని ప్రశ్నించారు.