
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎల్ఎండీ సమీపంలోని శాతవాహన ఫార్మసీ కాలేజీలో అకాడమిక్ బ్లాక్, ప్రహరీ నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పొన్నం మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానని తెలిపారు.
కార్యక్రమ అనంతరం కాలేజీకి చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పీఎం ఉష స్కీం కింద విడుదలయ్యే నిధులను ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీసీ ఉమేశ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ పాల్గొన్నారు.